ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

by Disha Web Desk |
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్‌ 6వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 7 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో దసరా సెలవులను ఖరారు చేస్తూ తేదీలను ప్రభుత్వం పొందుపరిచింది. ఇకపోతే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.

AP News : ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ ప్రభుత్వం



Next Story

Most Viewed